హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకుగాను టీ హబ్తో బోయింగ్ ఇండియా జత కట్టింది. అత్యాధునిక టెక్నాలజీతో వివిధ రంగాల్లో అద్భుతమైన ఆవిష్కరణలు చేసేందుకు వేదికగా ఉన్న టీహబ్తో బిల్డ్ పేరుతో ప్రత్యేక స్టార్టప్ ప్రోత్సాహక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా చేపట్టిన కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో మూడో విడత బిల్డ్ కార్యక్రమాన్ని టీ హబ్, బోయింగ్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి.
గతంలో నిర్వహించిన బిల్డ్ 2.0 కార్యక్రమానికి తెలంగాణ, ఏపీల నుంచి 159 దరఖాస్తులు రాగా, వీటిలో 32 దరఖాస్తులను ఎంపిక చేశారు. వీటిలోంచి 10 స్టార్టప్లను గుర్తించి, వాటిని ప్రోత్సహిస్తున్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఒక స్టార్టప్నకు రూ.10 లక్షల నగదు బహుమతిని బోయింగ్ ఇండియా అందించనున్నది. ఆసక్తి ఉన్న వారు టీ హబ్ వెబ్ సైట్ లేదా (https:// bit.ly/3EO0oLT)ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.