Storm Call 3 : భారత్కు చెందిన ప్రముఖ ఆడియో, వేరబుల్స్ బ్రాండ్ బోట్ దేశీ మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్వాచ్ స్టార్మ్ కాల్ 3ని లాంఛ్ చేసింది. మాపుల్స్ మ్యాప్మైఇండియా సాయంతో దేశంలో టర్న్-బై-టర్న్ నేవిగేషన్ను ఆఫర్ చేసే తొలి స్మార్ట్ఫోన్గా స్టార్మ్ కాల్ 3 నిలవనుంది.
ఈ స్మార్ట్వాచ్ వేలాది నగరాలు, గ్రామాలను కవర్ చేస్తూ దేశమంతటా నేవిగేషన్ సౌకర్యాన్ని యూజర్లకు ఆఫర్ చేయనుంది. ఈ ఫీచర్తో యూజర్లు తమ గమ్యస్ధానాలను సులభంగా చేరుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. లార్జ్ స్క్వేర్ షేప్లో స్టార్మ్ కాల్ 3 డిజైన్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.
స్టార్మ్ కాల్ 3లో బీటీ కాలింగ్ సామర్ధ్యంతో పాటు కెమెరా, మ్యూజిక్ కంట్రోల్స్, నోటిఫికేషన్ అలర్ట్స్, క్విక్ రిప్లయ్స్, డీఎన్డీ మోడ్, వెదర్ అప్డేట్స్, గేమ్స్, ఊబర్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పలు హెల్త్ ఫీచర్లతో కూడిన స్టార్మ్ కాల్ 3 చెర్రీ బ్లాజమ్, యాక్టివ్ బ్లాక్, ఆలివ్ గ్రీన్, సిల్వర్ మెటల్ వంటి నాలుగు కలర్స్లో లభిస్తుంది. రూ. 1099 ప్రారంభ ధరతో లభించే బోట్ లేటెస్ట్ స్మార్ట్వాచ్ బోట్ వెబ్సైట్, ఫ్లిప్కార్ట్, బ్లింకిట్లో అందుబాటులో ఉంది.
Read More :
Himalayan Lakes | భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు: ఇస్రో