న్యూఢిల్లీ, నవంబర్ 29 : లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన డివిజన్ బీఎండబ్ల్యూ మోటోరాడ్ కూడా తన వాహన ధరలు పెంచబోతున్నట్లు ప్రకటించింది. జనవరి 1, 2025 నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల ద్విచక్ర వాహన ధరలను 2.5 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా ధరలను పెంచాల్సి వచ్చిందని తెలిపింది.