హైదరాబాద్, మార్చి 9: భారత్లో అత్యధిక మంది ఇష్టపడే స్నాక్, ప్యాకేజ్ ఫుడ్ తయారీ సంస్థ బికానో..హైదరాబాద్లో నూతన ప్లాంట్ను ఆరంభించింది. ఉత్తర భారతంలో భారీ విజయాన్ని అందుకున్న సంస్థ..దక్షిణాది మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ను నెలకొల్పినట్లు కంపెనీ డైరెక్టర్ మనీష్ అగర్వాల్ తెలిపారు. రూ.10 కోట్ల వరకు పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో స్వీట్స్, నామ్కీన్స్ను ఉత్పత్తి చేయనున్నది. ప్రస్తుతం సంస్థ బ్రిటన్తోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నది.