న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఐడీబీఐ బ్యాంక్ ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విక్రయానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీలు 60.72 శాతం వాటా కలిగివున్నాయి.
బిడ్లకు చివరి రోజు డిసెంబర్ 16గా నిర్ణయించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్లో ఎల్సి 529.41 కోట్ల షేర్లతో 49.24 శాతం వాటా, కేంద్ర ప్రభుత్వానికి 488.99 కోట్ల షేర్లతో 45.48 శాతం వాటా కలిగివున్నది.