హైదరాబాద్, అక్టోబర్ 19: ఆభరణాల విక్రయ సంస్థ భీమా జ్యూవెల్స్ 99వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. గ్రాము బంగారంపై రూ.250 వరకు రాయితీ ఇస్తున్న సంస్థ.. క్యారట్ డైమండ్ జ్యూవెల్లరీపై రూ.20 వేల వరకు, ప్లాటినం జ్యూవెల్లరీపై 10 శాతం వరకు, కిలో వెండిపై రూ.4 వేలు రాయితీ ఇస్తున్నది.
వీటితోపాటు ఆభరణాలు కొనుగోలుపై బహుమతిని అందిస్తున్న సంస్థ..ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్, గోల్డ్ కాయిన్స్, వెండి నాణేలు, గిఫ్ట్ వోచర్లు గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది. లక్కీ డ్రాలో కిలో బంగారం, ఇద్దరు ప్యారిస్ లేదా దుబాయి ప్యాకేజ్ టూర్ను గెలుచుకోవచ్చును.