హైదరాబాద్, జూన్ 24 : ప్రభుత్వరంగ సంస్థ భీమ్ పేమెంట్స్ యాప్ లావాదేవీలు మూడింతలు అయ్యాయి. జూన్ 2025 నుంచి మే 2026 వరకు ఈ యాప్ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలు మూడింతలు పెరిగినట్టు ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్లడించింది. గతేడాది జూన్లో 79.64 మిలియన్ల లావాదేవీలు జరుగగా..ఈసారి మే చివరినాటికి ఇవి 244 మిలియన్లకు చేరుకున్నాయని ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ తెలిపారు.
మొత్తం లావాదేవీల విలువ రూ.26,952 కోట్లుగా నమోదైందన్నారు. ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సేవలకుగాను క్రెడిట్ కార్డు, డిజిటల్ రుణాలు, ఇతర రుణాల సేవలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీల్లో తెలంగాణ వాటా 23.9 శాతంగా ఉన్నదన్నారు.