రామచంద్రాపురం, జూలై 6: జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) టెక్నాలజీ జీఎంబీహెచ్ స్విట్జర్లాండ్తో గ్యాస్ టర్బైన్స్ టెక్నాలజీ ఒప్పందాన్ని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) పొడిగించింది. ఈ మేరకు భెల్ ఈడీ వరదరాజన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్లో గ్యాస్ టర్బైన్ల కోసం జీఈ టెక్నాలజీతో భెల్ 1986 నుంచి కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటిదాకా జీఈ డిజైన్ చేసిన దాదాపు 230 గ్యాస్ టర్బైన్లను వివిధ ఆయిల్ రిఫైనరీలు, ప్రాసెస్ ఇండస్ట్రీలు, ఇతరత్రా కస్టమర్లకు భెల్ పంపించింది. ఇదిలావుంటే ఒప్పందం పొడిగింపుతో ప్రస్తుత, అప్రేటెడ్, కొత్త గ్యాస్ టర్బైన్ మోడళ్లకు సంబంధించి కూడా భెల్కు హక్కులు లభిస్తున్నాయి.