న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ప్రభుత్వరంగ సంస్థ భెల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా కొప్పు సదాశివ మూర్తి నియామకానికి కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మే నెలలో భెల్ సీఎండీగా మూర్తిని నియమిస్తూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ప్రధాని అధ్యక్షతన అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్(ఏసీసీ) సూచించింది. ప్రస్తుతం ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1, 2023 నుంచి అమలులోకి రానున్న ఈ నియామకం.. 28.02.2027 వరకు కొనసాగనున్నారు.