హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెందిన కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్లో ఖనిజ అన్వేషణ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారం గనులను డిప్యూటీ సీఎం సందర్శించారు. కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన హట్టి గోల్డ్ మైన్స్తో సింగరేణి కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేవదుర్గలో ఖనిజ నిక్షేపాల పరిమాణం, నాణ్యతను నిర్ధారించేందుకు అన్వేషణ కొనసాగించాలని సూచించారు.
దేవదుర్గంలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, హట్టి గోల్డ్మైన్స్ ఉన్నతాధికారులు అరుణవ ఘోష్, షఫియుల్లాఖాన్, విధాత్రి ఉపుండ, తదితరులు పాల్గొన్నారు.