హైదరాబాద్, ఫిబ్రవరి 23: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్..హైదరాబాద్లో ఒకేసారి 18 నూతన స్టోర్లను ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 68కి చేరుకున్నాయి.
ఈ స్టోర్లలో కంపెనీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులతోపాటు ఎక్స్ట్రీమ్, ఎక్స్సేఫ్, 5జీ ప్లస్తోపాటు మొబైల్ బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని భారతీ ఎయిర్టెల్ ఏపీ-తెలంగాణ సీఈవో శివన్ భార్గవ తెలిపారు.