ముంబై, ఆగస్టు 24: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..మరో ఈవీ కారును విడుదల చేసింది. ఏఎంజీ ఈక్యూఎస్ 53 4 మ్యాటిక్ మోడల్ ప్రారంభ ధర రూ.2.45 కోట్లుగా నిర్ణయించింది. కేవలం 3.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నది.
సింగిల్ చార్జింగ్తో 529-586 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ కారును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా విక్రయిస్తున్నది. మరోవైపు, రూ.15 కోట్లతో 140 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.