ముంబై : కొవిడ్-19 తాజా వేరియంట్ వ్యాప్తిపై ఆందోళనతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఓ దశలో 1400 పాయింట్లు కోల్పోయి 57,600 పాయింట్ల దిగువకు పడిపోగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లు పతనమైంది. కొవిడ్-19 తాజా వేరియంట్ అత్యధిక మ్యుటేషన్లతో మరో వేవ్కు దారితీస్తుందని, దీంతో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ రికవరీని దెబ్బతీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దక్షిణాఫ్రికాలో B.1.1529 వేరియంట్ను గుర్తించారు.
ఈ వేరియంట్ ఆందోళన రేకెత్తించేదని శాస్త్రవేత్తలు చెబుతూ ఇది డెల్టా వేరియంట్ కంటే అధిక ముప్పు కలిగించేందని హెచ్చరించారు. కొవిడ్ తాజా వేరియంట్తో పాటు ధరల మంట, కార్పొరేట్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటం, అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ కఠిన ద్రవ్య విధానం వంటి అంశాలూ స్టాక్ మార్కెట్లలో మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.