న్యూఢిల్లీ, డిసెంబర్ 22: గోవా షిప్యార్డ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ ఇంజినీర్స్ లిమిటెడ్ల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)కు రూ.2,673 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. గోవా షిప్యార్డ్ నుంచి రూ.1,701 కోట్లు, గార్డెన్ రీచ్ షిప్ నుంచి రూ.972 కోట్ల ఆర్డర్లు అందాయి.
ఎలక్ట్రానిక్స్, అనుబంధ విభాగాలతోపాటు ఎంఎస్ఎంఈలకు సబ్ వెంచర్స్గా భెల్ వ్యవహరిస్తున్నది. కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా ఈ ఆర్డర్లు లభించాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.25,935.15 కోట్ల విలువైన ఆర్డర్లున్నాయి.