Online ITR fraud | ఐటీ రిఫండ్ కోసం మీ మొబైల్ ఫోన్కు ఏదైనా మెసేజ్ వచ్చిందా.. అందులో మీ ఖాతా నంబర్, ఇతర సమాచారం వెరిఫికేషన్ వివరాలు అడిగారా.. అయితే అటువంటి మెసేజ్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ఫేక్ మెసేజ్లకు రిప్లయ్ ఇచ్చారో.. ఆ మెసేజ్ పంపిన వారు మీ బ్యాంకు ఖాతాలో సొమ్ము మొత్తం ఖాళీ చేసేస్తారు.
గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ గడువు గత నెలాఖరుతో ముగిసిపోయింది. వేతన జీవులు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఆధారంగా ఆదాయం పన్ను విభాగం అధికారులు రీఫండ్ ప్రక్రియ ప్రారంభించారు. ఇదిలా ఉంటే, సైబర్ మోసగాళ్లు తెలివిగా వ్యవహరిస్తూ.. లింక్స్, మెసేజ్లు పంపడం గానీ, కాల్స్ చేయడం ద్వారా గానీ పన్ను చెల్లింపుదారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ అఫిషియల్ ఫ్యాక్ట్ చెక్ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ పేరిట షేర్ చేసిన ఓ మెసేజ్ వైరలైంది. అందులో ‘డియర్ సార్, మీ ఐటీఆర్ రీఫండ్ అప్లికేషన్ అప్రూవ్ చేశాం. రూ.15,490 మీ కాతాలో క్రెడిట్ అయింది. మీ ఖాతా నంబర్ 5xxxxx6755 కరక్ట్ కాదు. దీనిపై వెరిఫై చేయాలి. అప్ డేట్ చేయడానికి మీకు పంపిన లింక్లో మీ ఖాతా సమాచారం ఇవ్వండి’ అని వస్తుంది. ఆదాయం పన్ను విభాగం పేరిట కూడా ఇటువంటి మెసేజ్ వస్తుంది.
కానీ, పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం ఎటువంటి మెసేజ్లు పంపదు. ఐటీ రిటర్న్స్ వెరిఫికేషన్ తర్వాత మీరు ఐటీఆర్లో పేర్కొన్న మీ బ్యాంకు ఖాతాలో నేరుగా రీఫండ్ చేస్తుంది. ఈ సమాచారం మీ మొబైల్ ఫోన్ నంబర్కు గానీ, రిజిస్టర్డ్ ఈ-మెయిల్కు గానీ పంపుతుంది. మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఏదేనీ మెసేజ్ కావాల్సి వస్తే ఐటీ విభాగం అధికారులు మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్కు సమాచారం ఇస్తారు.
కనుక మీ బ్యాంకు ఖాతా ఇంప్రూవ్మెంట్ లేదా అప్డేట్ గురించి ఏదేనీ లింక్ వచ్చినా, మెసేజ్ వచ్చినా.. దాన్ని ఫ్రాడ్గా పరిగణించాలి. ఈ విషయమై ఆదాయం పన్ను విభాగానికి ఫిర్యాదు చేయాలి.
మీరు ఐటీ విభాగానికి ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు ఇవే..
1800 103 0025
1800 419 0025
+91-80-46122000
+91-80-61464700
ఐటీఆర్ ఫైల్ చేసిన ఏడు రోజుల నుంచి 120 రోజుల్లో ఐటీఆర్ రీఫండ్ అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీతో ఆన్లైన్లో ప్రక్రియ సాగుతున్నందున సగటున రీఫండ్ ప్రాసెసింగ్ సమయం గణనీయంగా తగ్గిపోతున్నది.