ముంబై, డిసెంబర్ 1: డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ). ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నట్లు తాజాగా శుక్రవారం ప్రకటించింది సంస్థ. 46 రోజుల నుంచి ఏడాది లోపు కలిగిన రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల లోపు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని స్వల్పంగా పెంచింది.
దీంతో 46 రోజుల నుంచి 90 రోజుల్లోపు డిపాజిట్లపై వడ్డీని 5.25 శాతానికి సవరించిన బ్యాంక్..91 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమితిపై 6 శాతం వడ్డీని, 180-210 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 6.25 శాతానికి, 211-ఏడాది లోపు డిపాజిట్లపై వడ్డీని 6.50 శాతానికి సవరించింది. అలాగే ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని 7.25 శాతంగా నిర్ణయించింది. గత నెలలో బ్యాంక్ రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీని పెంచిన విషయం తెలిసిందే.