న్యూఢిల్లీ, జనవరి 25: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) జారీచేసిన బాండ్ల ఇష్యూకు భారీ స్పందన లభించింది. రూ.5,000 కోట్లు సమీకరణకు రూ.5,000 కోట్లకు దీర్ఘకాలిక ఇన్ఫ్రా బాండ్ల ఇష్యూను ప్రారంభించగా, రూ.14, 950 కోట్ల విలువైన 128 బిడ్స్ అందాయని గురువారం బీవోబీ ఒక ప్రకటనలో తెలిపింది. 7.57 శాతం వార్షిక కూపన్ రేటుతో రూ. 5,000 కోట్ల విలువైన బిడ్స్ను ఆమోదించినట్టు బ్యాంక్ వెల్లడించింది.