న్యూఢిల్లీ, మే 16: బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.4,775.33 కోట్ల నికర లాభాన్ని గడించింది.
అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 1,778.77 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగింది. సమీక్షకాలంలో వడ్డీ ఆదాయం రూ.18,174 కోట్ల నుంచి రూ.25,857 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ వెల్లడించింది.