Fraud in Indian Bank | ఇండియన్ బ్యాంకులో ఫ్రాడ్ జరిగింది. ఈ విషయమై ఆర్బీఐకి స్వయంగా ఇండియన్ బ్యాంకు నివేదిక సమర్పించింది. మూడు మొండి బకాయి ఖాతాలకు సంబంధించి రూ.266 కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగిందని శనివారం ఆర్బీఐకి ఇచ్చిన ఆ నివేదికలో వివరించింది. ఈ మూడు ఖాతాలను ఫ్రాడ్ అని ప్రకటించింది.
ఎంపీ బోర్డర్ చెక్పోస్ట్స్ డెవలప్మెంట్ కో లిమిటెడ్ రూ.166.89 కోట్లు, పుణె షోలాపూర్ రోడ్డు డెవలప్మెంట్ రూ.72.76 కోట్లు, సొనాక్ రూ.27.08 కోట్ల మేరకు ఫ్రాడ్ చేశాయని ఇండియన్ బ్యాంక్ నిర్ధారించింది. ఈ మూడు కేసుల్లోనూ నిధుల దారి మళ్లింపు జరిగిందని పేర్కొంది.