UPI PIN with Aadhar | ఇప్పుడంతా డిజిటల్ చెల్లింపుల కాలం.. ప్రతిసారి డెబిట్ కార్డుతో ఏటీఎం సెంటర్కెళ్లి డబ్బు డ్రా చేయనక్కర్లేదు. డెబిట్కార్డుతో యూపీఐ యాక్టివేషన్తో గూగుల్ జీ-పే, భీమ్, ఫోన్పే తదితర యాప్స్ ద్వారా ఇప్పటి వరకు డిజిటల్ చెల్లింపులు జరిపాం. డెబిట్ కార్డుతో యూపీఐ యాక్టివేషన్ చేస్తున్నప్పుడు పిన్ నంబర్ రిజిస్ట్రేషన్ కోసం ఓటీపీ నమోదు చేస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా.. ఆధార్ నంబర్తో యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు.
డెబిట్కార్డుతో యూపీఐ యాక్టివేషన్ వల్ల ప్రక్రియతో కొన్ని ప్రతిబంధకాలు వచ్చాయి. చాలా మందికి పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నా.. డెబిట్ కార్డు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన ఖాతాదారుల వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. `మీకు ఈ విషయం తెలుసా? మీరు యూపీఐ యాక్టివేట్ చేసుకోవడానికి డెబిట్ కార్డు వాడాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డు స్కాన్ చేసి యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం https://bit.ly/3V9NOw3ను సందర్శించాలని పీఎన్బీ ట్వీట్ చేసింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెబ్సైట్ ప్రకారం `డెబిట్ కార్డు లేని వారు యూపీఐ ప్లాట్ఫామ్పై చెల్లింపులు జరుపడానికి ఆధార్ ఓటీసీ బెటర్ తేలిక మార్గం. ఆధార్ కార్డుతో యూపీఐ ప్లాట్ఫామ్ రీసెట్ చేసుకోవచ్చు` అని తెలిపింది.