ముంబై, డిసెంబర్ 22: బజాజ్ ఆటో తమ పాపులర్ మాడల్ బజాజ్ పల్సర్ పేరిట పల్సర్ మేనియా మాస్టర్స్ ఎడిషన్ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న పల్సర్ అభిమానులను ఏకం చేసేలా నిర్వహించిన ఈ ఈవెంట్లో 25వేల మందికిపైగా పాల్గొనగా, లక్షకుపైగా వీక్షకులు రావడం విశేషం.
100కుపైగా నగరాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఉత్సాహవంతమైన సాహసికులు పల్సర్ బైక్లతో అబ్బురపరిచే విన్యాసాలు చేశారు. ఈ క్రమంలోనే ముంబైలోని రిచర్డ్సన్ అండ్ క్రూడాస్లో నేషనల్ ఫినాలేను బజాజ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ైస్టెల్, ప్రెసిషన్, పవర్ జోన్ వంటి కస్టమైజ్డ్ ఛాలెంజ్ జోన్లు రైడర్ల ప్రతిభను పరీక్షించాయి. ఇందులో విజేతగా మహమ్మద్ నుమాన్ నిలవగా, రెండు, మూడు స్థానాల్లో జీత్ సింగ్, ఇనియవన్ రవిచంద్రన్ ఉన్నారు. విజేతలతోపాటు ఈ ఎడిషన్లో పాల్గొన్న వారందర్నీ బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్ సైకిల్ వ్యాపార విభాగం అధ్యక్షుడు సారంగ్ కనాడే ఈ సందర్భంగా అభినందించారు.