న్యూఢిల్లీ, జూన్ 16: వివిధ ఉత్పత్తులతో అన్నివర్గాల వినియోగదారులకూ తాము చేరువ అవుతున్నందున, వచ్చే ఐదేండ్లలో పతంజలి గ్రూప్ టర్నోవర్ రూ.లక్ష కోట్లకు చేరుతుందని ఆ గ్రూప్ వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరేందుకు తమ గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ (గతంలో రుచి సోయా) గణనీయమైన పాత్ర పోషిస్తుందని, ఈ కంపెనీ టర్నోవర్ ఐదేండ్లలో రూ. 45,000-50,000 కోట్లకు పెరుగుతుందని అన్నారు.
ప్రీమియం విభాగంలో పతంజలి ఫుడ్స్ తాజాగా న్యూట్రాస్యూటికల్స్, హెల్త్ బిస్కెట్స్, పోషకాలతో కూడిన చిరుధాన్యాలు, డ్రైఫ్రూట్స్ తదితర 14 కొత్త ఉత్పత్తుల్ని శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మీడియాతో మాట్లాడుతూ యూనీలీవర్ మినహా మిగిలిన బహుళజాతి సంస్థలన్నింటినీ తమ గ్రూప్ అధిగమించిందని చెప్పారు.