న్యూఢిల్లీ, డిసెంబర్ 6: హైదరాబాద్కు చెందిన ఎప్కోజెన్ను హస్తగతం చేసుకున్నట్టు యాక్సిస్కేడ్స్ టెక్నాలజీస్ ప్రకటించింది. విద్యుత్ విభాగానికి ఇంజినీరింగ్ డిజైనింగ్, సొల్యుషన్స్ సేవలు అందిస్తున్న ఎప్కోజెన్ను రూ. 26.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఉత్తర అమెరికా, మధ్యతూర్పు దేశాల్లో పాగవేయాలనే ఉద్దేశంతో సంస్థ ఈ కొనుగోళ్లు జరిపినట్టు యాక్సిస్కేడ్స్ సీఈవో, ఎండీ అరుణ్ కృష్ణమూర్తి తెలిపారు. యాక్సిస్కేడ్స్తో కుదుర్చుకున్న వాటా ఒప్పందంతో అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించడానికి ఈ ఒప్పం దం దోహదం చేయనున్నదన్నారు.