న్యూఢిల్లీ, జనవరి 24: ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో యాక్సిస్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం రూ.3,973 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) క్యూ3తో పోల్చితే దాదాపు మూడింతలు పెరగడం విశేషం. ఇక స్టాండలోన్ నికర లాభం రూ.3,614.24 కోట్లుగా ఉన్నది. నాడు రూ.1,116 కోట్లుగా ఉన్నట్టు సోమవారం బ్యాంక్ వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం ఎగిసి రూ.8,653 కోట్లుగా ఉంటే, నికర వడ్డీ లాభం 3.53 శాతాన్ని తాకింది.