న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఈ పండుగ సీజన్లో ఎలాగైనా కస్టమర్లను ఆకట్టుకోవాలని అన్ని రంగాలూ ఆలోచిస్తున్నాయి. ఇందుకు బ్యాంకులూ మినహాయింపు కాదు. అందుకే కరోనా ప్రభావంతో దెబ్బతిన్న వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు బ్యాంకర్లు మునుపెన్నడూ లేనివిధంగా రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే యాక్సిస్ బ్యాంక్ మంగళవారం ఓ సరికొత్త ఆఫర్ను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే ఎంపిక చేసిన గృహ రుణాలపై 12 ఈఎంఐలను రద్దు చేస్తామని బ్యాంక్ ప్రకటించింది. అంతేగాక ఈ ఫెస్టివ్ ఆఫర్ కింద వివిధ రకాల ఆన్లైన్ కొనుగోళ్లపై డిస్కౌంట్లనూ తెచ్చింది. దిల్ సే ఓపెన్ సెలబ్రేషన్స్ పేరుతో ఈ పండుగ ఆఫర్లను తీసుకొచ్చింది. ‘ఈ పండుగ సీజన్లో మా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూర్చడానికి ప్రముఖ బ్రాండ్లు, స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని యాక్సిస్ బ్యాంక్ రిటైల్ రుణాల అధిపతి సుమిత్ బాలీ అన్నారు.
ఆన్లైన్ షాపింగ్పై డిస్కౌంట్లు
ఎంపిక చేసిన హోమ్ లోన్లపై 12 ఈఎంఐలు మినహాయింపు
టూవీలర్ కస్టమర్లకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండానే ఆన్-రోడ్ ఫైనాన్స్
వ్యాపారుల కోసం టర్మ్-ఎక్విప్మెంట్ లోన్లు, వాణిజ్య వాహనాల
ఫైనాన్స్పై ప్రత్యేక ప్రయోజనాలు
యాక్సిస్ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా
చేసే కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లు
సూచించిన 50 నగరాల్లో ఎంపిక చేసిన 2,500 స్థానిక
వ్యాపారుల వద్ద జరిపే కొనుగోళ్లపై 20% వరకు డిస్కౌంట్
రిటైల్ లోన్ ప్రొడక్ట్స్, రెస్టారెంట్లలో బిల్లులపై రాయితీలు
తక్కువ వార్షిక వడ్డీకే వ్యక్తిగత (10.25%), విద్య (8.99%), బంగారు (9%) రుణాలు