ముంబై, జనవరి 13: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లిమిటెడ్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.690.41 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.589.64 కోట్ల నికర లాభాన్ని గడించింది.
గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17.31 శాతం ఎగబాకి రూ.11,569.05 కోట్ల నుంచి రూ.13,572.47 కోట్లకు చేరుకున్నది. నిర్వహణ ఖర్చులు సైతం 17.31 శాతం అందుకొని రూ.12,656.46 కోట్లకు చేరుకోవడంలో లాభాల్లో భారీ వృద్ధికి బ్రేక్లు వేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఎన్సీఆర్, తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ర్టాల్లో 341 స్టోర్లను నిర్వహిస్తున్నది. మరోవైపు, కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్గా హరీష్చంద్ర ఎం భరుకా నియమితులయ్యారు.