హైదరాబాద్, సెప్టెంబర్ 1: ప్రముఖ ఔషధ సంస్థ అరబిందో ఫార్మా..బయోలాజికల్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా క్యూరాటెక్యూ బయోలాజిక్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి రూ.300 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి క్యూరాటెక్యూ బోర్డు డైరెక్టర్లు సమావేశమై అనుమతినిచ్చారు. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. వచ్చే మూడేండ్లలో ఈ యూ నిట్ అందుబాటులోకి రానున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.