న్యూఢిల్లీ, మే 30: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్ నికరలాభం 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 28 శాతం క్షీణించి రూ. 576 కోట్లకు తగ్గింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ లాభం రూ.801 కోట్లుగా నమోదయ్యింది.
సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 2021-22 సంవత్సరానికి రూ.1 ముఖవిలువగల షేరుపై రూ.4.50 చొప్పున డివిడెండు చెల్లించే ప్రతిపాదనను ఆమోదించింది. ఆదాయం సైతం రూ.6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు క్షీణించింది, పరిశ్రమకు ఎదురైనా, కంపెనీ మెరుగైన పనితీరును కనపర్చినట్టు అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె నిత్యానందరెడ్డి చెప్పారు.