న్యూఢిల్లీ, జూన్ 3: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ ఇండియా కొత్త కార్లపై అన్లిమిటెడ్ మేలేజీతో ఐదేండ్ల వారెంటీ సదుపాయం కల్పించింది. ఈ నెల 1 నుంచి కొనుగోలు చేసిన ప్రతికారుపై ఈ వారెంటీ కల్పిస్తున్నది.
దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టి 15 ఏండ్లు పూర్తైన సందర్భంగా సంస్థ ప్రత్యేక వారెంటీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆడీ ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఈ ఐదేండ్లలో అన్లిమిటెడ్ మైలేజీ, ఏదైన మరమ్మత్తులు లేదా విడిభాగాలు పాడైతే ఉచితంగా చేసి ఇవ్వనున్నది. ప్రస్తుతం సంస్థ క్యూ2, క్యూ5, క్యూ7, ఏ4తో పాటు పలు మోడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.