Asus ROG Phone 8 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్ (Asus) తన అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ (Asus ROG Phone 8 Series) ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. కన్జూమర్ ఎలక్ట్రానిక్ షో (సీఈఎస్)-2024లో వీటిని ప్రదర్శించనున్నది. అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ (Asus ROG Phone 8 Series) ఫోన్లలో అసుస్ రోగ్ ఫోన్8 (Asus ROG Phone 8), అసుస్ రోగ్ 8 ప్రో (Asus ROG Phone 8 Pro) ఉంటాయి. అధికారికంగా ఈ నెల ఎనిమిదో తేదీన అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తామని అసుస్ ఇండియా ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేసింది. అదే రోజు గ్లోబల్ సీఈఎస్-2024 సమ్మిట్లో ఆవిష్కరిస్తామని తెలిపింది. అయితే అసుస్ రోగ్ 8 ఫోన్ తోపాటు అసుస్ రోగ్ 8 ప్రో ఫోన్ను భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తుందా? లేదా? అన్నది క్లారిటీ లేదు.
ఇంతకుముందు వచ్చిన వార్తల ప్రకారం అసుస్ రోగ్ ఫోన్ 8, అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో ఫోన్లు రెండూ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రోగ్ యూఐ వర్షన్పై పని చేస్తాయి. ఈ ఫోన్లు 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ప్యానెల్స్ విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. అసుస్ రోగ్ ఫోన్ 8 ప్రో మోడల్ హెచ్డీఆర్10, 165 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగి ఉంటాయని భావిస్తున్నారు. అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటాయి. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ నుంచి 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ ఉంటుందని తెలుస్తోంది.
అసుస్ రోగ్ ఫోన్ 8 సిరీస్ ఫోన్లు ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ కెమెరా, 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 32-మెగా పిక్సెల్ టెలిఫోటో సెన్సర్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం అసుస్ రోగ్ 8 ప్రో ఫోన్ లో 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుందని సమాచారం. క్విక్ చార్జ్ 5.0 అండ్ పీడీ చార్జింగ్ మద్దతుతో ఈ ఫోన్లు 5500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తాయని చెబుతున్నారు.