ముంబై, అక్టోబర్ 7: భారతీయ సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫోర్బ్స్ టాప్-100 భారతీయుల జాబితాలో వరుసగా 14వసారి ముకేశ్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద 92.7 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తేలింది. 74.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉండగా, ఏడాది కింద అదానీ సంపద కేవలం 17.9 బిలియన్ డాలర్లుగానే ఉండటం గమనార్హం. ఇక మొత్తం ఈ 100 మంది సంపద విలువ 775 బిలియన్ డాలర్లకు చేరగా, గతేడాదితో పోల్చితే 50 శాతం ఎగబాకడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా విలయం ప్రభావం ఉన్నప్పటికీ గడిచిన 12 నెలల్లో 257 బిలియన్ డాలర్లు ఎగిసింది. ఈసారి జాబితాలోకి ఆరుగురు కొత్తవారు రాగా, ఆరుగురు మహిళలకూ చోటు దక్కింది. అలాగే ఈ టాప్-100లో ఐదుగురు తెలుగువారున్నారు.
ముకేశ్ అంబానీ 92.7
గౌతమ్ అదానీ 74.8
శివ్ నాడార్ 31
రాధాకిషన్ దమానీ 29.4
సైరస్ పూనావాలా 19
లక్ష్మీ మిట్టల్ 18.8
సావిత్రి జిందాల్ 18
ఉదయ్ కొటక్ 16.5
పల్లోంజీ మిస్త్రీ 16.4
కుమార్ బిర్లా 15.8
మురళీ దివీ 9.9
సతీష్ రెడ్డి, కుటుంబం 3.01
పీపీ రెడ్డి 2.73
ప్రతాప్ రెడ్డి 2.53
పీవీ రామ్ప్రసాద్ రెడ్డి 2.45