హైదరాబాద్, సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): యూనికార్స్న్… ప్రతి స్టార్టప్ కల ఇది. రూ.వంద కోట్ల మైలురాయి దాటి యూనికార్స్న్ జాబితాలో నమోదయ్యే లక్ష్యాన్ని ఎంచుకుంటాయి. కానీ ఏప్రిల్ నెలలో దేశంలోనే కొత్త యూనికార్న్ నమోదు కాకపోవడం ప్రతికూల పరిణామం.
అయితే దేశంలోని స్టార్టప్లు గత మార్చి, ఏప్రిల్ నెలల్లో 5.8 బిలియన్ డాలర్లను సేకరించగా… గత ఏడాదితో పోలిస్తే ఇది 15 శాతం తగ్గుదలను నమోదు చేసిందని వెంచర్ ఇంటిలిజెన్స్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆన్లైన్ ట్యూటరింగ్ కంపెనీ వేదాంతు ఏకంగా ఏడు శాతం ఉద్యోగులను ఒకేరోజు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కంపెనీలో 5,900 మంది ఉండగా… అందులో 424 మందిని తొలగించినట్లుగా సీఈవో వంశీకృష్ణ ప్రకటించారు.