Apple BKC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: ఐఫోన్ల ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. దేశంలో తన తొలి రిటైల్ అవుట్లెట్ను మంగళవారం ముంబైలో ప్రారంభిస్తున్నది. ఆ మరుసటి రోజే ఢిల్లీలో తన రెండో రిటైల్ అవుట్లెట్ను స్టార్ చేయబోతున్నది.
దేశీయ మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న యాపిల్ సంస్థ.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక స్టోర్లను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. భారత్లో సంస్కృతితోపాటు అద్భుతమైన శక్తిదాగివుందని, కస్టమర్టకు దీర్ఘకాలికంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి 5 బిలియన్ డాలర్ల విలువైన మొబైళ్లు విదేశాలకు యాపిల్ ఎగుమతయ్యాయని చెప్పారు.