న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశీయ టాబ్లెట్ పీసీ మార్కెట్లో యాపిల్ హవా కొనసాగుతున్నది. గతేడాది, డిసెంబర్ త్రైమాసికంలోనూ సంస్థ 25 శాతం మార్కెట్ వాటాతో తొలి స్థానంలో నిలిచిందని సర్వే వెల్లడించింది. అలాగే సామ్సంగ్ 23 శాతం మార్కెట్ వాటాతో ఆ తర్వాతి స్థానంలో నిలిచినట్లు సైబర్మీడియా రీసర్చ్ తాజాగా వెల్లడించింది. కానీ, అంతక్రితం ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన దాంతో పోలిస్తే యాపిల్ ట్యాబ్లెట్ పీసీ మార్కెట్ 17 శాతం తగ్గింది. 24 శాతం మార్కెట్ వాటాతో లెనోవా రెండో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా టాబ్లెట్కు డిమాండ్ అధికంగా ఉండటం, ముఖ్యంగా ప్రీమి యం, 5జీ, వాల్యు-ఫర్-మనీ టాబ్లెట్లు ఆఫర్లు ఇస్తుండటం కూడా ఇందుకు కలిసొచ్చింది. రూ.20 వేల నుంచి రూ.30 వేల లోపు ధర కలిగిన టాబ్లెట్లు ప్రీమియంగా గుర్తిస్తున్నది.