న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: రక్షణ రంగం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్టు అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్(ఏఎంఎస్ఎల్) ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన ఈ ఏఎంఎస్ఎల్..మౌలిక, రవాణా, ఏరోస్పేస్, రక్షణ రంగాలకు టెక్నాలజీ ఆధారిత సేవలు అందిస్తున్నది. రక్షణ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అపోలో డిఫెన్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏపీడీఐపీఎల్) పేరుతో ప్రత్యక సంస్థను ఏర్పాటు చేసినట్టు ప్రమోటర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు.