హైదరాబాద్, ఆగస్టు 8: ప్రముఖ వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ ..తాజాగా హార్యాన రాష్ట్రంలోకి అడుగు పెట్టింది. గురుగ్రామ్లోని నాయతి ఆసుపత్రి అండ్ రీసర్చ్ ఎన్సీఆర్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఆసుపత్రిని రూ.450 కోట్లకు కొనుగోలు చేసింది.
5.63 ఎకరాల స్థలంలో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ ఆసుపత్రిలో 650 పడకలు ఉన్నాయి. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మాట్లాడుతూ..ఉత్తర భారతంలో మరో ఆసుపత్రిని కొనుగోలు చేసినట్లు, దీంతో ఇక్కడ ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
వచ్చే రెండేండ్లలో ఇంటిగ్రేటెడ్ హెల్త్కేర్ కాంప్లెక్స్ అందుబాటులోకి రానున్నదని, ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.