దేశీయ మార్కెట్కు పరిచయం చేసిన ఔరాబీట్
హైదరాబాద్, ఆగస్టు 10: హాంకాంగ్కు చెందిన ఔరాబీట్ సంస్థ.. దేశీయ మా ర్కెట్లోకి సరికొత్త ఎయిర్ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. అమెరికా ఎఫ్డీఏ ఆమోదించిన ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ధరల శ్రేణి రూ. 17,000ల నుంచి 74,000 వరకు ఉన్నది. వివిధ మోడళ్లలో లభించే ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు.. ప్రాణాంతక సార్స్-కోవ్-2 వంటి యాంటి వైరస్లనూ అడ్డుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయని ఔరాబీట్ తెలిపింది. ‘దశాబ్దానికిపైగా ఎయిర్ ప్యూరిఫ యర్స్ తయారీలో పరిశోధనలు చేసి ఈ ఏజీప్లస్ ఫైవ్-స్టేజ్ స్టెరిలైజేషన్ ప్యూరిఫ యింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశాం’ అని ఔరాబీట్ వెల్లడించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ ప్యూరిఫయర్ అవసరం ఎంతో ఉన్నదని, తమ ఏజీప్లస్ సిల్వర్ ఐయాన్ యాంటీవైరల్ ఎయిర్ ప్యూరిఫయర్.. కేవలం 15 నిమిషాల్లో కొవిడ్-19 వైరస్ను గాలిలో నుంచి తొలగించగలదని రుజువైనట్లు ఔరాబీట్ ఇండియా సీఈవో వెంకట్ తెలిపారు.