న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఎడాపెడా లేఆఫ్స్కు తెగబడుతున్నాయి. ఫేస్బుక్, అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు కూడా వేలాది ఉద్యోగులను సాగనంపాయి. లింక్డిన్, నౌక్రీ.కాం వంటి జాబ్ సెర్చ్ ప్లాట్ఫాంలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ వంటి ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న అభ్యర్ధులతో నిండిపోయాయి.
లేఆఫ్స్ వణికిస్తున్న క్రమంలో ఓ ఐటీ కంపెనీ భారత్ నుంచి వేయి మందికి పైగా ప్రొఫెషనల్స్ను (IT professionals) రిక్రూట్ చేసుకునేందుకు సన్నద్ధమవడం టెకీల్లో ఆశలు రేపుతోంది. లైప్ సైన్సెస్ పరిశ్రమకు చెందిన ఆక్స్ట్రియా ఇంక్ రాబోయే ఎనిమిది నెలల్లో భారత్ నుంచి 1000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకునేందుకు కసరత్తు సాగిస్తోంది. డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో నిపుణులను హైర్ చేసుకునేందుకు కంపెనీ సన్నద్ధమైంది.
హైదరాబాద్, గురుగ్రాం, నోయిడా, బెంగళూర్, పుణేలోని తన కార్యాలయాల్లో ఈ ఉద్యోగులను నియమించుకోనుంది. రానున్న పది నెలల్లో భారత్లోని పలు ప్రదేశాల్లో ఉన్న తన కార్యాలయాల్లో వేయిమందికి పైగా డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా ఇంజనీర్లను ఆక్స్ట్రియా రిక్రూట్ చేసుకోనుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్లో ప్రస్తుతం ఈ కంపెనీలో దాదాపు 3000 మంది భారత ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు.
Read More :