Russia Invansion | ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరిగాయి. కానీ దేశీయంగా ధరల స్థిరత్వానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం శనివారం హామీ ఇచ్చింది. అంతర్జాతీయ చమురు మార్కెట్లలో పరిస్థితిని సునిశితితంగా గమనిస్తున్నామని, ఆయిల్ సరఫరాలో అంతరాయం కలిగే అవకాశాలు ఉంటే.. ధరల స్థిరీకరణకు అత్యవసర నిల్వలను సప్లయ్ చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది నవంబర్ నాలుగో తేదీ నుంచి 113 రోజులుగా దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దీపావళి పండుగ కానుకగా అప్పట్లో పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం స్వల్పంగా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగాయి. దీనికి అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ జారీ చేసిన ప్రకటన వాహన చోదకులకు రిలీఫ్ ఇచ్చినట్లయింది.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్తోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఉత్తరప్రదేశ్లో మరో రెండు దశల పోలింగ్ జరుగాల్సి ఉంది. రాజకీయంగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చాలా కీలకం.