న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో లేటెస్ట్ టెక్నాలజీపై ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించాలని అమెజాన్ (Amazon) నిర్ణయించింది. ఏఐ రెడీ ప్రోగ్రాం పేరుతో 2025 నాటికి 20 లక్షల మంది టెకీలకు ఏఐ కోర్సులను అమెజాన్ ఉచితంగా బోధించనుంది. ఏఐ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్ సహా ఎనిమిది కోర్సులతో ఏఐ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను అమెజాన్ ఆఫర్ చేస్తోంది.
భవిష్యత్లో అత్యంత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను సిద్ధం చేయడంలో భాగంగా అమెజాన్ ఈ శిక్షణా కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతోంది. ఇప్పటికే 2.1 కోట్ల మంది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్లో శిక్షణ పొందారని అమెజాన్ తెలిపింది. 2025 నాటికి తన ఏఐ కోర్సుల ద్వారా మరో 20 లక్షల మందికి చేరువ కావాలని అమెజాన్ కసరత్తు సాగిస్తోంది.
సీనియర్లు, యువతకు సరిపడేలా న్యూ ప్రోగ్రామ్స్ను అమెజాన్ లాంఛ్ చేస్తోంది. ఏఐ రెడీ ప్రోగ్రాంలో భాగంగా ఎనిమిది నూతన ఫ్రీ ఏఐ కోర్సులను అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఆఫర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 50,000 హైస్కూల్స్, యూనివర్సిటీ విద్యార్ధుకు ఏడబ్ల్యూఎస్ జనరేటివ్ ఏఐ స్కాలర్షిప్ను అమెజాన్ అందిస్తోంది. కోడ్.ఓఆర్జీ భాగస్వామ్యంతో జనరేటివ్ ఏఐ ప్రపంచాన్ని విద్యార్ధులకు అమెజాన్ పరిచయం చేయనుంది.
Read More :
BTech | గుడ్న్యూస్.. ఉద్యోగం చేసుకొంటూ..ఇంజినీరింగ్ చదవొచ్చు