వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్.. నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు రూ.1490 కోట్లు (200 మిలియన్ల డాలర్లు) విరాళంగా అందజేశారు. ఈ మ్యూజియం పని తీరును మెరుగు పరిచే లక్ష్యంతో జెఫ్ బెజోస్ ఈ విరాళం అందజేశారు. 2018 నుంచి మ్యూజియానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు వచ్చిన విరాళాల్లో జెఫ్ బెజోస్దే అత్యధికం. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ టైకూన్ కెన్నెథ్ బెహ్రింగ్ 2000లో 80 మిలియన్ల డాలర్ల విరాళం అందించారు. 1846లో ఈ సంస్థ ఏర్పాటైంది. తర్వాత జేమ్స్ స్మిత్ షోన్ అనే బ్రిటన్ శాస్త్రవేత్త పేరు పెట్టారు.
ఎడ్యుకేషన్, రీసెర్చ్ రంగాల్లో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మ్యూజియం స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్. మ్యూజియం మరమ్మతు పనుల కోసం 70 మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తామని స్మిత్ సోనియన్ ఇన్స్టిటూషన్ వెల్లడించింది.
130 మిలియన్ల డాలర్లతో కొత్తగా న్యూ ఎడ్యుకేషన్ సెంటర్ నిర్మిస్తామని ఈ ఇన్స్టిట్యూషన్ ప్రకటించింది. దీనికి జెఫ్ బెజోస్ పేరుతో బెజోస్ లెర్నింగ్ సెంటర్ అని పేరు పెడతామని ప్రకటించింది. సైన్స్, మ్యాథ్స్, ఇంజినీరింగ్ రంగాల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు ఈ సెంటర్ కీలకం కానున్నది.