న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ప్రీమియం కార్ల విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన కియా..2024 ఏడాదికిగాను మరో మాడల్ను అప్గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆరు-ఏడు సీట్ల సామర్థ్యంతో రూపొందించిన కారెన్స్ ప్రారంభ ధర రూ.12,11,900గా నిర్ణయించింది. అలాగే 1.5 డీజిల్ ఎంటీ కారెన్స్ ధర రూ.12,66,900గా నిర్ణయించింది. పాత మాడల్తో పోలిస్తే కొత్తది 30 వరకు అదనపు ఫీచర్స్తో రూపొందించింది. స్మార్ట్ కీ, పుష్ బటన్ స్టార్ట్, రియర్ ఎల్ఈడీ లైట్స్, ఆరు-స్పీడ్ గేర్లు, 1.5 డీజిల్ ట్రాన్స్మిషన్ ఫీచర్స్తో తయారు చేసింది. ఇప్పటి వరకు 1.5 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.