న్యూఢిల్లీ, జనవరి 3: ఓఎన్జీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా సారథ్యం వహించబోతున్నారు. కంపెనీ సీఎండీ సుభాష్ కుమార్ పదవీ విరమణ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు బాస్ లేకుండా నడుస్తున్న సంస్థకు తొలిసారిగా మహిళా నాయకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఓఎన్జీసీ మానవ వనరుల విభాగ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అల్క మిట్టల్ను సీఎండీగా నియమించింది కేంద్ర ప్రభుత్వం.