బీజింగ్ : అలీబాబా గ్రూప్ హోల్డింగ్ (Alibaba) సహ వ్యవస్ధాపకులు జాక్ మా ఫుడ్, బెవరేజ్ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ను విక్రయించే నూతన సంస్ధను జాక్ మా ప్రారంభించాడని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది. ఈ నిర్ణయంతో పదవీ విరమణ అనంతరం జాక్ మా వ్యవసాయ రంగంపై దృష్టాసారిస్తారనే సంకేతాలు పంపారు.
2019లో తన 55వ పుట్టిన రోజున అలీబాబా చైర్మన్గా జాక్ మా వైదొలిగారు. ఇక జాక్ మా ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్ కంపెనీ పేరు హంగ్ఝూ మా కిచెన్ ఫుడ్గా నిర్ణయించారు. వ్యాపార దిగ్గజం జాక్ మా స్వస్ధలం హంగ్ఝూ కేంద్రంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించారని నేషనల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ పబ్లిసిటీ సిస్టమ్ డేటా వెల్లడించింది.
ఈ కంపెనీ ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ మీల్స్, ఎడిబుల్ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తుంది. కరోనా మహమ్మరి అనంతరం ప్యాకేజ్డ్ ఫుడ్కు డిమాండ్ పెరగడం, జీవన శైలి మార్పుల కారణంగా జాక్ మా ఫుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక చైనాలో రాబోయే మూడేండ్లలో దేశీ రెడీ మీల్స్ పరిశ్రమ భారీగా వృద్ధి చెందనుందని మార్కెట్ పరిశోధన వర్గాలు తెలిపాయి.
Read More :
Pneumonia Cases | న్యుమోనియా కేసుల వ్యాప్తి : రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు