SBI Alert | అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎప్పటికప్పుడు ఆర్థిక లావాదేవీలు, చార్జీల వడ్డన, వడ్డీరేట్లలో మార్పులు చేర్పులు, ఇతర అంశాలపై తన ఖాతాదారులను అలర్ట్ చేస్తుంటుంది. తాజాగా స్మార్ట్ ఫోన్ ద్వారా అందించే సేవలపై మరో అలర్ట్ జారీ చేసింది. ఎస్బీఐ యోనో యాప్ ఖాతాదారులు తమ ఆండ్రాయిడ్ వర్షన్ (ఓఎస్)ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
పాత ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్న వారు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ 9, ఆ పై వర్షన్ అప్డేట్ చేసుకోవాలని తన ఖాతాదారులకు ఎస్బీఐ సూచించింది. ఆండ్రాయిడ్ ఓఎస్9 కంటే తక్కువ వర్షన్లో గూగుల్ తన సెక్యూరిటీ అప్డేట్స్ గూగుల్ నిలిపివేసింది. కనుక ఖాతాదారులు భద్రతతో కూడిన బ్యాంకింగ్ లావాదేవీలు పొందాలంటే తక్షణం ఆండ్రాయిడ్ ఓఎస్9 వర్షన్కు తమ ఫోన్లు అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది ఎస్బీఐ.
ఆన్లైన్ లావాదేవీలకు అనుగుణంగా సైబర్ మోసాలు పెరిగిపోయాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ అన్ సెక్యూర్డ్ అయితే, సైబర్ మోసగాళ్లు దాడి చేసే అవకాశాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఓఎస్లో సెక్యూరిటీ అప్డేట్స్ లేకుంటే సైబర్ మోసగాళ్లు దాడి చేసే అవకాశం ఉన్నందున ఎస్బీఐ ఖాతాదారులు తక్షణం ఆండ్రాయిడ్ అప్డేట్ వర్షన్ అప్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ సూచించింది.
యోనో యాప్ ద్వారా ఎస్బీఐ.. ఆన్లైన్లో బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నది. బ్యాంకింగ్ మోసాల బారీన పడకుండా ఉండాలంటే బర్త్డే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడీ, పిన్, ఓటీపీ తదితర అంశాలు ఇతరులతో షేర్ చేసుకోవద్దని పేర్కొంది. కేవైసీ, పాన్ అప్డేట్ చేసుకోండంటూ వచ్చే లింక్లను క్లిక్ చేయొద్దని హితవు చెప్పింది.