న్యూఢిల్లీ, మార్చి 20: ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్..పోస్ట్పెయిడ్ యూజర్లను ఆకట్టుకోవడానికి నెలవారి ప్రత్యేక ఫ్యామ్లీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 105-320 జీబీ విభాగాల్లో ఈ ప్లాన్లను విడుదల చేసింది. కంపెనీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు రూ.599 నుంచి రూ.1,499 ఫ్యామ్లీ ప్లాన్లతోపాటు డీటీహెచ్, ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను రూ.799 నుంచి రూ.2,299 రేంజ్లో అందిస్తున్నది. ఈ ఆఫర్లలో భాగంగా కుటుంభ సభ్యులకు డాటా, కాల్స్, ఎస్ఎంఎస్లు అందిస్తున్నది.