న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: నరేంద్ర మోదీ సర్కార్ ఏ ప్రభుత్వరంగ సంస్థను వదలడం లేదు. అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న సంస్థలను అమ్మేసిన సర్కార్..తాజాగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థలపై కన్ను పడింది. వీటిని ఎయిర్ ఇండియా మాదిరిగానే ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పాలని తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను తక్కువకే టాటా సన్స్ గ్రూపునకు విక్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు నాలుగు అనుబంధ సంస్థలైన ఏఐఏటీఎస్ఎల్, అలయెన్స్ ఎయిర్, ఏఐఈఎస్ఎల్, హెచ్సీఐలు ఉన్నాయి. వీటితోపాటు బర్డ్ గ్రూపు, సెలెబి ఏవియేషన్, ఐ స్వైర్డ్ క్యాపిటల్ అనే సంస్థలు కూడా ఉన్నాయి. వీటిని మాత్రం ఏఐఏటీఎస్ఎల్ కొనుగోలు చేయాలని చూస్తున్నది.
ప్రత్యేక రోడ్డుషో
ఎయిర్ ఇండియా సబ్సిడరీ సంస్థలను విక్రయించే ఉద్దేశంలో భాగంగా పెట్టుబడిదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ప్రణాళికను రచిస్తున్నది. ఎయిర్ ఇండియా నాలుగు అనుబంధ సంస్థలతోపాటు మరో మూడు చిన్న స్థాయి సంస్థలపై ప్రైవేట్ పరం చేయడానికి ప్రత్యేక రోడ్డు షోలు నిర్వహిస్తున్నట్లు, ఈ విక్రయ ప్రతిపాదనకు సంబంధించి క్యాబినెట్ అనుమతి కూడా లభించిందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
అమ్మకానికి సిద్ధంగా ఉన్న సంస్థలు