న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జెట్ ఫ్యూయల్ ధరలు భగ్గుమనడంతో విమానయాన సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్చార్జీని మళ్లీ విధిస్తున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లు దేశీయ విమాన టికెట్లపై రూ.399 ఫ్యూయల్ సర్చార్జీ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
అలాగే అంతర్జాతీయ విమాన టికెట్లపై కూడా సర్చార్జీని వసూలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫ్యూయల్ సర్చార్జీ ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్న ట్టు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో నడువనున్న విమానాలపై ఫ్యూయల్ సర్చార్జీని 10 డాలర్లు పెంచడంతో ఆఫ్రికా రూట్లలో నడిచే విమానాల్లో ఫ్యూయల్ సర్చార్జీ 30-90 డాలర్ల మధ్యలో వసూలు చేస్తున్నది.