Air India | రెండు దశాబ్దాలకు పైగా.. మూడు దఫాల ప్రయత్నాల తర్వాత కేంద్రప్రభుత్వ ఫ్లాగ్షిప్ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (ఏఐ) అలియాస్ మహారాజా.. ప్రైవేటీకరణ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. 90 ఏండ్ల క్రితం స్థాపించిన టాటా సన్స్ గ్రూప్ వద్దకే తిరిగి ఎయిర్ ఇండియా చేరుకున్నది. 1932లో టాటా ఎయిర్లైన్స్ పేరిట జహంగీర్ రతన్ జీ దాదాబాయ్ (జేఆర్డీ) టాటా విమాన యాన సంస్థ స్థాపించారు.
టాటా సన్స్ ఏవియేషన్ డివిజన్.. ఎయిర్ ఇండియా.. 1946లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. 1948లో యూరప్కు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ప్రారంభించింది.
ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్.. 1948లోనే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా, టాటా సన్స్కు 25 శాతం, మిగతా పెట్టుబడులు ప్రైవేట్ మదుపర్లు పెట్టారు.
1953లో ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. నాటి నుంచి దేశీయ విమానయాన సర్వీసుల్లో నాలుగు దశాబ్దాలకు పైగా మెజారిటీ ఎయిర్ ఇండియా నియంత్రణలో ఉండేవి.