హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి థాయ్లాండ్లోని ఫుకెట్ నగరానికి విమాన సర్వీస్ ప్రారంభమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి విమానం శుక్రవారం టేకాఫ్ అయినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ తెలిపారు. కొత్త సర్వీస్తో ఫుకెట్-హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ ఘననీయంగా పెరుగుతుందని తెలిపారు. ఈ విమానం 3:45 గంటల్లో గమ్యాన్ని చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మూడు సర్వీసులను నడుపుతుందని తెలిపారు.